సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు ,భూమిక జంటగా భారీ బడ్జెట్ , సెట్స్ తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఒక్కడు ” మూవీ ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ 8 నంది , 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. “ఒక్కడు ” మూవీ తమిళ , కన్నడ , బెంగాలీ , హిందీ , ఒడియా , సింహళ భాషలలో రీమేక్ అయ్యి విజయం సాధించింది.
ఈ మూవీ కై స్పెషల్ గా చార్మినార్ సెట్ ను రూపొందించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో మహేష్ బాబు కెరీర్ లోనే ఈ సినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రాబట్టిన “పోకిరి “మూవీ ని అధునాతన డిజిటల్ సాంకేతికతను జోడించి ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు.4K రిజొల్యూషన్ లోకి రీ మాస్టర్ చేసి డాల్ఫీ ఆడియోతో ఈ సినిమాను ఆగష్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.ఇప్పుడు నిర్మాత , దర్శకుడు ఎం ఎస్ రాజు , మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగష్టు 9 తేదీ నుండి “ఒక్కడు “మూవీ క్యూబ్ డిజిటల్ ఫార్మాట్ లో అందుబాటులో ఉండనుందని ఎం ఎస్ రాజు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: