పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ సినిమా ప్రాజెక్ట్ కే. ఈసినిమాకు మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తుండటంతో ఇప్పటినుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటి వరకూ పాన్ ఇండియా సినిమాలతో సందడి చేస్తున్న ప్రభాస్ ను ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ కు తీసుకెళుతున్నారు మేకర్స్. ఇక దీపికా పదుకొణెకు తెలుగులో ఇది తొలిచిత్రం. దీంతో వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా షూటింగ్ వాయిదా పడిందంటూ ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం దీపికా పదుకొనే అంటున్నారు. అసలు సంగతేంటంటే.. ఈసినిమా షూటింగ్ శరవేగంగా హైద్రాబాద్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో దీపికా కాస్త అనారోగ్యానికి గురైంది. దానిలో భాగంగానే రీసెంట్ గా ఆమె కామినేని హాస్పిటల్కు వెళ్లి చెకప్ చేయించుకోవడం జరిగింది. దీంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈవార్తల్లో ఎలాంటి నిజం లేదంటున్నారు మేకర్స్. తాజాగా ఈరూమర్స్ పై స్పందిస్తూ.. ప్రాజెక్ట్ k షూటింగ్ ఆగిందంటూ వినిపిస్తోన్న వార్తల్లో నిజం లేదని అనుకున్న ప్లానింగ్ ప్రకారం షూటింగ్ జరుగుతుంది.. జూన్ 20 వరకు ప్రస్తుతం జరగుతున్న షెడ్యూల్ చిత్రీకరణ ఉంటుందని నిర్మాత అశ్వినీ దత్ క్లారిటీ ఇచ్చారు.
కాగా ఈసినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈసినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: