ఒకపక్క కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది.. ఇలాంటి సమయంలో సినిమాను రిలీజ్ చేయాలంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.. మరోపక్క ధైర్యం చేసి సినిమా రిలీజ్ చేసినా ప్రేక్షకులు సినిమా చూడటానికి వస్తారా లేదా అన్నది మరో ప్రశ్న. కానీ ఇవన్నీ వేరే పరిశ్రమల్లో.. తెలుగు ప్రేక్షకులు మాత్రం ఇందుకు పూర్తి విభిన్నం అని చెప్పొచ్చు. సరైన సినిమా పడితే ఆసినిమాను ఏరేంజ్ లో సక్సెస్ చేస్తారో ఇప్పటికే చూశాం. ఇప్పుడు భీమ్లానాయక్ తో మరోసారి నిరూపించారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సంపాదించుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ను గట్టిగానే రాబడుతుంది. మూడు రోజుల్లోనే ‘భీమ్లా నాయక్’ వంద కోట్లు మార్క్ను టచ్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన థమన్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ఇప్పటికే చాలా సార్లు చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. పవన్ సినిమాకు పనిచేయాలని ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న ఆ కల వకీల్ సాబ్ తో నెరవేరింది అని ఇప్పటికే చెప్పారు. అంతేకాదు వకీల్ సాబ్ తరువాత ఇప్పుడు భీమ్లానాయక్ కు కూడా మ్యూజిక్ అందించే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం భీమ్లానాయక్ సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతున్న నేపథ్యంలో తాజాగా మరోసారి తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానాన్ని తెలియచేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ, సంయుక్త మీనన్ తో కలిసి భీమ్లానాయక్ సినిమా చూశానని.. ఇది డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అంటూ ఫొటోను పోస్ట్ చేశాడు.
View this post on Instagram
కాగా ఈసినిమా విజయంలో పవన్-రానా నటన, త్రివిక్రమ్ మాటలతో పాటు థమన్ సంగీతం కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పడంతో ఎలాంటి సందేహం లేదు. రిలీజ్ కు ముందే పాటలు సెన్సేషన్ క్రియేట్ చేయగా.. సినిమా రిలీజ్ అయిన తరువాత మాత్రం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మాత్రం మరో రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చితక్కొట్టేశాడని.. సినిమాను మరో లెవన్ కు తీసుకెళ్లాడన్నా ప్రశంసలు దక్కించుకున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: