మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాను ఇటీవలే లాంఛనంగా ప్రారంభించగా ఇప్పుడు షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనున్నారు. ఇక మొదటి షెడ్యూల్ ను పూణె లో మొదలుపెట్టనున్నారట. దీనికోసం ఇప్పటికే అక్కడ భారీ సెట్ కూడా వేసినట్టు తెలుస్తుంది. సమాచారం ప్రకారం మొదటి షెడ్యూల్ లోనే చరణ్ మరియు కియారాల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. మొదటి షెడ్యూల్ ను దాదాపుగా నెల రోజుల పాటు నిర్వహిస్తారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే కియారా చాలా సినిమాలతో బిజీగా ఉంది. కానీ ఈసినిమాకు కూడా కియారా అద్వానీ బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు శంకర్ మూవీకి గాను ఎప్పడు అడిగితే అప్పడు డేట్లు ఇచ్చేట్లుగా ముందుగానే మాట్లాడుకున్నట్టు సమాచారం. ఇక కియారా అద్వానీ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతూనే మరోపక్క వేరే లాంగ్వేజస్ లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.
ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. అంజలి, సునీల్, శ్రీకాంత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: