బ్లాక్ బస్టర్ “ఛలో” మూవీ తో పరిచయం అయిన రష్మిక పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ లో అడుగు పెట్టారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” మూవీ తో రష్మిక బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఆ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే రష్మిక మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వికాస్ బెహెల్ దర్శకత్వంలో బిగ్ బీ అమితాబ్ , రష్మిక ప్రధాన పాత్రలలో తండ్రీ కూతుళ్ళ నేపథ్యం లో “గుడ్ బై “మూవీ తెరకెక్కుతుంది. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం ముంబై లో జరుగుతున్న “గుడ్ బై “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ, అభిమానులతో ముచ్చటిస్తూ , వారికీ పలు సూచనలు చేస్తున్న విషయం తెలిసిందే. రష్మిక ఇప్పుడు ఒక అరుదైన రికార్డ్ ను నెలకొల్పారు. రష్మిక ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య 19 మిలియన్ కు చేరుకుంది. తక్కువ కాలంలో రష్మిక ఈ రికార్డ్ ను క్రియేట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: