సౌత్ సినీ కెరీర్ ప్రారంభించి ఇక్కడ సక్సెస్ అందుకొని నార్త్ కు వెళ్లి అక్కడ సినిమాలు చేస్తూఅక్కడే స్టిక్ అయిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. అక్కడ ఒకటో రెండో సినిమాలు చేసి తరువాత అవకాశాలు రాక సినీ కెరీర్ ను నాశనం చేసుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ మాత్రం అలా కాకుండా తమ సినీ కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ సినిమాలు చేస్తూ మరోవైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తమ కెరీర్ కు ఎలాంటి రిస్క్ లేకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పూజాహెగ్డే, రష్మిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో ఉండగా.. మరోవైపు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక రీసెంట్ గా సమంత కూడా వెబ్ సిరీస్ నార్త్ ఆడియన్స్ ను పలకరించింది. ఇక ఇప్పుడు మరో టాలెంటెడ్ హీరోయిన్ ను కూడా బాలీవుడ్ పలకరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆహీరోయిన్ ఎవరో కాదు ఫిదా బ్యూటీ సాయి పల్లవి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన సాయి పల్లవి ఒక్క సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆతరువాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా తన నటనతో అందరినీ ఫిదా చేసి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అయితే సాయి పల్లవి గురించి అందరికీ తెలిసిందే చాలా సెలక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటుందని అదే తనకు మరో ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చిపెట్టింది. ఈనేపథ్యంలోనే బాలీవుడ్ నుండి సాయి పల్లవికి సినిమా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. ఓ ప్రముఖ బ్యానర్ సాయిపల్లవిని కాంటాక్ట్ అయ్యిందని సాయి పల్లవికి కూడా ప్రాజెక్ట్ నచ్చిందని.. బాలీవుడ్ కు వెళ్లడానికి ఈ అమ్మడు కూడా సిద్ధంగానే ఉందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ప్రస్తుతం తెలుగులో సాయిపల్లవి నటించిన రెండు చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ కానున్నాయి. అందులో నాగచైతన్యతో కలిసి నటించిన ‘లవ్ స్టోరీ’ ఒకటికాగా.. రానాతో నటించిన విరాటపర్వం. అలాగే నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తుంది సాయి పల్లవి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























