ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన కార్తికేయ మొదటిసినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసినా కూడా ఒక మోస్తరు విజయాన్ని అయితే సొంతం చేసుకున్నాయి కానీ ఆరేంజ్ హిట్ మాత్రం అందుకోలేదు. ఇక కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ పాత్రలో గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా నటించి విలన్ గా కూడా ఓకే అనిపించుకున్నాడు. ఇప్పుడు తమిళ్ లో ఏకంగా అజిత్ సినిమాలో విలన్ గా నటించే అవకాశం దక్కించుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే చావు కబురు చల్లగా సినిమాలో బస్తీబాలరాజు ఒక మాసీ క్యారెక్టర్ లో నటించి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక ఈనేపథ్యంలో తాజాగా తన ఇన్స్టాలో ఈ పాత్ర గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషన్ అయ్యాడు. చావు కబురు చల్లగా’ చిత్రం నటుడిగా నన్ను ఆవిష్కరించింది. చాలా మంది హృదయాలకు దగ్గరయ్యాను. బస్తీ బాలరాజు పాత్రకు వచ్చిన రెస్పాన్స్ చూసి గర్వపడ్డాను. మూవీ నచ్చనివారు చిన్న తప్పులున్నా క్షమించేసి మరో చాన్స్ ఇవ్వండి. నా తప్పులను సరిదిద్దుకుని బౌన్స్ బ్యాక్ అవుతాను అన్నారు కార్తికేయ.
View this post on Instagram
ఇక ప్రస్తుతం కార్తికేయ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సినిమా చేస్తున్నాడు తెరకెక్కుతున్న ఈసినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు సుకుమార్ అందిస్తున్నారు. దర్శకుడు, తదితర వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: