గోల్డ్ కాయిన్ మోషన్ పిక్చర్స్ కంపెనీ బ్యానర్ పై సాచి దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ , బిజూ మీనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “మలయాళ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. పృథ్విరాజ్ సుకుమారన్ , బిజూ మీనన్ పోటా పోటీ గా నటించి చిత్ర విజయానికి తోడ్పడ్డారు. ఇప్పుడు ఆ మూవీ తెలుగు రీమేక్ రైట్స్ ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ స్వంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో”అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ తెరకెక్కనుంది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ కు జోడిగా టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్య మీనన్ ను సంప్రదిస్తున్నారు. గ్లామర్ షో కంటే తన పవర్ పేక్డ్ పెర్ఫార్మెన్స్ తో నిత్యామీనన్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన “వకీల్ సాబ్ “మూవీ ఏప్రిల్ 9వ తేదీ రిలీజ్ కానుంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా “హరిహర వీరమల్లు ” మూవీ తెరకెక్కుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: