శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16 వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా అది కూడా పూర్తి కావస్తుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల విడుదల చేసిన సారంగధరియ పాట మాత్రం సాయి పల్లవి కెరీర్ లో మరో హిట్ సాంగ్ గా నిలిచిపోయింది. ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తుంది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఈసినిమా నుండి.. ఏవో ఏవో కలలే అనే పాటను రిలీజ్ చేయనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈపాటను రిలీజ్ చేయనున్నారు.
కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: