హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో వస్తున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్తో పాటు వరుస ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాదు ఈసినిమా విజయం కోసం మంచు విష్ణు కూడా అంతే ఈగర్ గా వైయిట్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ఈ మూవీ ట్రైలర్ను షేర్ చేశాడు. అంతేకాదు, ‘అను అండ్ అర్జున్ల మోసగాళ్లు ఆసక్తికరంగా ఉంది. ఇందులో నటించిన మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టిలతో పాటు ఈ టీమ్ మొత్తానికి నా బెస్ట్ విషెస్’ అంటూ ట్వీట్ చేశాడు.
#Mosagallu #AnuAndArjun looks interesting. 👍 Best wishes to @iVishnuManchu @SunielVShetty @MsKajalAggarwal and the entire team for the release. https://t.co/CLa7uYLP3A
— Mahesh Babu (@urstrulyMahesh) March 18, 2021
కాగా నవదీప్, నవీన్ చంద్ర, రుహాని సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు.. శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: