రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యరాజు ప్రధాన పాత్రలో ‘నాట్యం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రామ్ చరణ్ సతీమణి ఉపాసన రిలీజ్ చేయగా దానికి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ ను చూస్తే టైటిల్ కు తగ్గట్టుగానే పూర్తిగా ‘నాట్యం’ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్నట్టు అర్ధమవుతుంది. ‘ఒక కథను వింటాం కదా. అదే కథను కళ్లకు చూపిస్తే దాన్ని నాట్యం అంటాం. నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం’ అంటూ ఆదిత్య మీనన్ చెప్పే డైలాగ్లతో ప్రారంభమైన టీజర్లోని ప్రతి సన్నివేశం ఆకట్టుకునేలా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing the renowned dancer Smt @SandhyaRaju garu and the team of #Natyam the very best. Here’s the teaser https://t.co/dshzfZlMIE
@RevanthOfficial @NatyamTheMovie
— Jr NTR (@tarak9999) February 10, 2021
కాగా నిశృంకల ఫిల్స్మ్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాలో కమల్కామరాజు, రోహిత్ బెహల్, భానుప్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రేవంత్ కొరుకొండ ఈ చిత్రానికి రచన – దర్శకత్వం వహించడమే కాకుండా సినిమాటోగ్రఫీ – ఎడిటింగ్ వర్క్ కూడా చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: