మెగా హీరోస్ చరణ్, వరుణ్ కు కరోనా పాజిటివ్ రావడంతో వారితో ఉన్న వారందరూ ఇప్పుడు టెస్ట్ లు చేయించుకునే పనిలో వున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు శిరీష్ కూడా టెస్ట్ లు చేయించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు అల్లు శిరీష్. ‘రెండు సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాను.. రెండు సార్లూ నెగిటివే అని వచ్చింది.. ఈ విషయం తెలపడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అని ట్వీట్ చేసాడు. అంతేకాదు ఈ కోవిడ్ గురించి మీకు కొన్ని సూచనలు మాత్రం చేయాలనుకుంటున్నాను..” అని పలు విషయాలు పంచుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేను పెళ్లిళ్లకు అటెండ్ అయ్యాను.. చాలా ప్రదేశాలు తిరిగాను.. దాదాపు 100 మంది మధ్య షూటింగ్స్ లో పాల్గొంటున్నాను.. రోజు మాస్క్ వేసుకుంటున్నాను.. శానిటైజర్ వాడుతున్నాను.. కానీ ప్రాక్టికల్ గా మాత్రం అది చాలా కష్టం.. బట్ చేస్తూనే నేను సేఫ్ గా ఉన్నానంటే దానికి ఆయుర్వేదం మరియు లక్ కారణం అని చెప్పొచ్చు. అందరూ కరోనాకి సరైన వ్యాక్సిన్ వచ్చే వరకు.. మాస్క్లు ధరిస్తూ.. తాను చెప్పిన ఆయుర్వేద పద్దతులు కూడా పాటించమని శిరీష్ తన పోస్ట్లో తెలిపారు.
Happy to share that I have got myself tested twice. Was NEGATIVE both the times. Below is a small thread I wanna share about Covid19 and health in general.
— Allu Sirish (@AlluSirish) December 30, 2020
2013లో విడుదలైన ‘గౌరవం’ చిత్రంతో కథానాయకుడుగా తొలి అడుగులు వేశాడు అల్లు శిరీష్. ఆ సినిమా నిరాశపరిచినా… మారుతి డైరెక్షన్లో వచ్చిన ‘కొత్తజంట’ తో తొలి విజయాన్ని చవి చూశాడు శిరీష్. ఆ తరువాత ‘శ్రీరస్తు శుభమస్తు’ రూపంలో మరో విజయం దక్కింది. గత ఏడాది ఏబీసీడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పటివరకూ ఏ సినిమాను ప్రకటించలేదు. ప్రస్తుతం కొత్త కథలు వింటున్నాడు. త్వరలోనే కొత్త కథతో ముందుకు రానున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: