శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ , నభా నటేష్ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “సోలో బ్రతుకే సో బెటర్” మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన”సోలో బ్రతుకే సో బెటర్” మూవీ అంచనాలకు తగ్గట్టుగానే ప్రేక్షకాదరణ పొంది దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. థమన్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సోలో బ్రతుకే సో బెటర్” మూవీ సక్సెస్ మీట్ నిన్న (మంగళవారం ) జరిగింది. ఈ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథి గా నటుడు , నిర్మాత , దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి పాల్గొన్నారు. హీరో సాయి తేజ్ మాట్లాడుతూ .. కొవిడ్ -19 సమయం లో ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చి మూవీ చూస్తారో , లేదో ననీ చాలా భయపడ్డామనీ , ప్రేక్షకులు థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారనీ , సినిమానే గెలిచిందనీ అన్నారు. నారాయణ మూర్తి మాట్లాడుతూ .. కరోనా కారణం గా చిత్ర పరిశ్రమ అనేక లోటు పాట్లకు గురి అయ్యిందనీ , థియేటర్స్ కు ప్రేక్షకులు వస్తారనే నమ్మకం తో చిత్ర యూనిట్ ముందడుగు వేయడం అభినందనీయం అనీ , రిలీజ్ అయ్యే పలు మూవీస్ కు “సోలో బ్రతుకే సో బెటర్” మూవీ మార్గదర్శి గా నిలిచిందనీ చెప్పారు. ఈ మూవీ లో భాగం కావడం ఆనందంగా ఉందని హీరోయిన్ నభా నటేష్ చెప్పారు. ఈ మూవీ విడుదలకు ఇండస్ట్రీ మొత్తం అండగా నిలిచిందని నిర్మాత చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: