మలయాళ సినిమా అంగమలై డైరీస్ను తెలుగులో ‘ఫలక్నుమా దాస్’గా తెరకెక్కించిన విశ్వక్ సేన్.. హీరోగా, దర్శకుడిగా మంచి విజయం సాధించాడు. ఇక గత ఏడాది శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమా చేసి దానితో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. విశ్వక్ సేన్ ప్రస్తుతం లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ‘పాగల్’ సినిమా చేస్తున్నాడు. ఇక విశ్వక్ సేన్ తమిళ్ హిట్ మూవీ ‘ఓ మై కడవులే’ తెలుగు రీమేక్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. పీవీపీ సినిమాస్ ‘ఓ మై కడవులే’ హక్కులను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, తరుణ్ భాస్కర్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. త్వరలో ఈ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. తరుణ్ భాస్కర్ చిత్రానికి డైలాగ్స్ అందిస్తుండగా, అశ్వథ్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో అశోక్ సెల్వన్ , రితికా సింగ్ జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “ఓ మై కడవులే “. తమిళంలో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. హీరో విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో నటించాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: