కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ మూతబడి చిత్ర పరిశ్రమ పలు నష్టాలకు గురి అయిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమ పై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు కష్టాలపాలయ్యాయి. ఎట్టకేలకు చిత్ర పరిశ్రమ పూర్వపు వైభవం దిశగా అడుగులు వేస్తుంది. మూవీ షూటింగ్స్ ప్రారంభం కావడం , థియేటర్స్ ఓపెన్ అవడం శుభసూచకంగా కనిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా సినీ ప్రేమికులు థియేటర్ ఎక్స్ పీరియన్స్ కు దూరం అయ్యారు. 50 శాతం సీటింగ్ తో థియేటర్స్ , మల్టీ ప్లెక్స్ లకు అనుమతి ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
హైదరాబాద్ లో చాలాచోట్ల మల్టీ ప్లెక్స్ లు , థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. సినీ సెలబ్రిటీస్ సినిమాలను థియేటర్స్ లో చూడాలని ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ “రాధేశ్యామ్ “మూవీ తో పాటు పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా సమయం లో హీరో ప్రభాస్ స్పందించి బాధితులకై భారీ విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే. థియేటర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయనీ , సినిమాలను థియేటర్స్ లో ఎక్స్ పీరియన్స్ చేద్దాం అంటూ థియేటర్స్ ను ప్రమోట్ చేస్తూ ఒక వీడియో క్లిప్ ను ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: