ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ తో రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి నాగ్ అశ్విన్ సినిమా కూడా వుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేతా థామస్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే నాగ్ అశ్విన్ నివేతాకు కథను వినిపించగా కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ కు చెల్లెలిగా నివేతా నటించనుందట. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. వినడానికి మాత్రం చాలా బావుంది.
కాగా ఈ ఏడాది పొంగల్ కి విడుదలైన దర్బార్ సినిమాలో రజినీ కాంత్ కు కూతురి పాత్రలో నటించింది నివేతా థామస్. ఈ సినిమాలో తండ్రీకూతుళ్లుగా నటించిన వీరి నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. మరి ఒకవేళ ప్రభాస్ కు చెల్లెలి పాత్ర కనుక నిజమే అయితే కచ్చితంగా ఆ కాంబినేషన్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా నివేద హీరోయిన్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 5 న ఓటీటీ లో రిలీజ్ కానుంది. వీటితోపాటు “వకీల్ సాబ్ “, మరో రెండు తెలుగు మూవీస్ లో నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: