బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకొని మరణించిన తర్వాత నేపోటిజం పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది సెలెబ్రిటీస్ దీనిపై స్పందించారు. కొంతమందికి బంధుప్రీతి ఉంటుంది అంటే కొంత ఉంటే తప్పేంటి అని ఇలా ఎవరికి నచ్చిన వెర్షన్స్ వాళ్ళు వినిపించారు. ఇప్పుడు ఇక ఈ నేపోటిజంపై రకుల్ ప్రీత్ కూడా మాట్లాడుతూ తన అభిప్రాయం ఏంటో కూడా చెప్పుకొచ్చిది. అవుట్ సైడర్-ఇన్ సైడర్ ఇంకా ఇండస్ట్రీ నాన్ ఇండస్ట్రీ ఉంటుందని నేను అనుకోవట్లేదు.. ఏ ఇండస్ట్రీ అయినా ఎవరి కెరీర్ వాళ్లకి ఉంటుంది.. ఇండస్ట్రీలో ఎవరు ఉండాలి.. ఎవరు ఉండకూడదనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు అని అన్నారు. ఒక్కోసారి అవకాశాలు రావడం లేట్ అవ్వొచ్చు.. అలా అని మన ఫేట్ ను అది మార్చదు అని కాస్త గట్టిగానే మాట్లాడింది రకుల్. కెరీర్లో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి.. వాటిని తట్టుకొని నిలబడటానికి మరింత కష్టపడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రకుల్ ప్రీత్ సింగ్ మొదట బాలీవుడ్తోనే కెరీర్ ప్రారంభించింది. అయితే ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాలే స్టార్ హీరోయిన్ రేంజ్ ను తెచ్చిపెట్టాయి. అయితే ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ పై కన్నేసింది. గత ఏడాది దే దే ప్యార్ దే సినిమాతో బాలీవుడ్లో తొలి విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటిస్తుంది రకుల్. హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. వీటిలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 ఒకటి. వీటితోపాటు వెబ్ సిరీస్ ల్లో కూడా నటించడానికి ఈ భామ ఇంట్రెస్ట్ చూపుతుంది రకుల్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: