నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఓ డివోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. రెండు విభిన్న పాత్రల్లో బాలయ్య దర్శనమివ్వనున్న ఈ చిత్రాన్ని యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే… తాజాగా `అల వైకుంఠపురములో` వంటి బ్లాక్ బస్టర్ మూవీకి ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన పి.ఎస్. వినోద్ .. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించనున్నారని తెలిసింది. త్వరలోనే వినోద్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
[custom_ad]
తమిళ చిత్రం `రిథమ్` (2000)తో కెమెరామ్యాన్ గా అరంగేట్రం చేసిన వినోద్.. `మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి, ధ్రువ, అరవింద సమేత, అల వైకుంఠపురములో` వంటి విజయవంతమైన తెలుగు చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు. బాలకృష్ణ, బోయపాటితో వినోద్ కి ఇదే తొలి చిత్రం కావడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: