టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ ఇంట్లో విషాదం నెలకొంది. అలీ మాతృమూర్తి జైతన్ బీబీ (75) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.41కి మరణించారు. అయితే అలీ ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉండగా.. తల్లి మరణ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక జైతన్ బీబీ భౌతిక కాయాన్ని రాజమండ్రి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్లోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కమెడియన్ ఆలీ తల్లి మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు తమ తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తల్లిపై తనకు వున్న అభిమానాన్ని పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అలీ తన తండ్రిపేరిట సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: