విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. కేవలం హీరోగానే కాదు.. మంచి రైటర్ గా కూడా అడివి శేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇటీవల ‘ఎవరు’ సినిమాతో కూడా మంచి హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ ఘటనల ఆధారంగా.. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శేష్ రెండు భిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఈ రోజు 26/11 కావడంతో మరోసారి అడివి శేష్ ఆ సంఘటనను గుర్తుచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఒక ఎమెషనల్ లేఖను కూడా రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. కాగా మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
Today in memory of the #2611attack
We remember. #MajorTheFilm@GMBents @SonyPicsIndia @AplusSMovies @sashikirantikka pic.twitter.com/WPPoc2vbVi— Adivi Sesh (@AdiviSesh) November 26, 2019
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: