చందూ మొండేటి దర్శకత్వంలో, నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014 వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ నిఖిల్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా సీక్వెల్ ను తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే కన్ఫామ్ ఐన సంగతి కూడా విదితమే. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ కూడా ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడట చందూ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే మొదలెట్టనున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే.. ఈ రోజు ఈ సినిమా చిత్ర బృందం ‘పళని’ పుణ్య క్షేత్రానికి వెళ్లి సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
కాగా ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల గురించి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి చందు గత ఏడాది తెరకెక్కించిన సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈసారి ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని చూస్తున్నారు. ఈ సినిమాతో తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.
[youtube_video videoid=SEvu4A9iS5Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: