‘మెంటల్ మదిలో’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన నివేదా పేతురాజ్… ఈ ఏడాది ఏప్రిల్లో వచ్చిన ‘చిత్రలహరి’తోనూ ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘బ్రోచేవారెవరురా’తో మరోసారి ప్రేక్షకులను అలరించిన ఈ భామ… బ్యాక్ టు బ్యాక్ హిట్స్ను తన ఖాతాలో వేసుకుంది. ఆల్రెడీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సెకండ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ అమ్మడు… బన్నీ హీరోగా నటించనున్న ‘ఐకాన్’లోనూ ఓ నాయికగా నటించే అవకాశం దక్కించుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే… ‘చిత్రలహరి’ వంటి సినిమాతో తనకు మంచి విజయాన్ని అందించిన దర్శకుడు కిషోర్ తిరుమలతో మరోసారి జట్టుకట్టనుందట నివేదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల ఓ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ను తెరకెక్కించనున్నాడని టాలీవుడ్ టాక్. తమిళ చిత్రం ‘తడమ్’కు రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్కు జంటగా నివేదాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే `తడమ్` రీమేక్పై, నివేదా ఎంట్రీపై మరింత క్లారిటీ వస్తుంది.
[subscribe]
[youtube_video videoid=4bgWcJ5L6ww]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: