మహర్షి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ ను కూడా ఫిక్స్ చేసేశారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు ఈ సినిమాకు. అయితే తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. కాశ్మీర్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ఈరోజు ప్రారంభించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతి మరో కీలక పాత్రలో నటిస్తోంది. దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. మరి ఎఫ్ 2 సూపర్ హిట్ తరువాత, మహర్షి సూపర్ హిట్ తరువాత అనిల్ రావిపూడి-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ప్రారంభానికి ముందే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను వీరు బ్రేక్ చేస్తారా?లేదా? చూద్దాం..
[youtube_video videoid=hnyNenuG-BM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: