వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా రూపొందిన మహర్షి మూవీ మే 9వ తేదీ రిలీజ్ కానుంది. మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1వ తేదీ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథి. సక్సెస్ ఫుల్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, హీరో సుధీర్ బాబు, రైటర్ శ్రీమణి, నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, నటులు పోసాని, రాజీవ్ కనకాల, ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్య అతిథి విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ .. మహర్షి మూవీ ట్రైలర్ లో చెప్పినట్టు మహేష్ బాబు కూడా ప్రపంచాన్ని ఏలేస్తాడని, మహేష్ బాబు ఏ యాంగిల్ లోనైనా అందంగా ఉంటాడని, ట్రైలర్ అదిరిపోయిందని, అన్ని రికార్డ్స్ బద్దలుకొట్టేయాలని, మహేష్ బాబు కు మహర్షి 25వ మూవీ అని, మహేష్ వయసు కూడా 25 గా అనిపిస్తోందన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. మహేష్ బాబు అభిమాని గానే ఈ ఈవెంట్ కు వచ్చానని, ప్రతీ జనరేషన్ కు ఒక సూపర్ స్టార్ ఉంటారని, ఈ జనరేషన్ కు మహేష్ బాబు సూపర్ స్టార్ అని, మురారి మూవీ తో సినిమాలు చూడటం మొదలుపెట్టానని, తన బర్త్ డే రోజున మహర్షి మూవీ రిలీజ్ కావడం ఆనందంగా ఉందన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ .. మహర్షి సినిమా గురించి ఎంతైనా కోరుకోండి, ఆ కోరిక ఈ నెల 9వ తేదీ తీరబోతుందని, దర్శకుడు వంశీ దర్శకత్వం వహించిన 5సినిమాలలో మహర్షి మూవీ అత్యుత్తమం అన్నారు. మహేష్ బాబు ను రాజకుమారుడు మూవీ తో హీరోగా పరిచయం చేశామని, ఈ 25 వ మూవీ లో పాలుపంచుకొనడం గర్వంగా ఉందని నిర్మాత అశ్వనీదత్ అన్నారు. ఈ నెల 18వ తేదీ విజయవాడ లో విజయోత్సవ సభ ఏర్పాటు చేస్తామని నిర్మాత పొట్లూరి ప్రసాద్ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ .. మహేష్ బాబు తో జర్నీ బాగుంటుందని, మహేష్ 25 వ చిత్రానికి సంగీతం అందించడంగౌరవంగా భావిస్తా నన్నారు.
హీరోయిన్ పూజ హెగ్డే మాట్లాడుతూ … మహేష్ బాబు ఎప్పటికైనా మంచి దర్శకుడు అవుతారని, సన్నివేశాన్ని ఆయన అర్ధం చేసుకునే విధానం ఎప్పుడు కొత్తగా ఉంటుందన్నారు. హీరో మహేష్ బాబు తో కలసి నటించడం ఆనందంగా ఉందని అల్లరి నరేష్ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ .. మైలు రాయి వంటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడం వంశీ అదృష్టమని, ట్రైలర్ బాగుందని మహేష్ బాబు సినీకెరీర్ లో మహర్షి మూవీ అత్యుత్తమ చిత్రంగా మిగిలిపోవాలన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ .. మే 9వ తేదీ అభిమానులకు గుర్తుండిపోయే రోజని, మహేష్ బాబు నటుడి గానే కాదు వ్యక్తిగానూ సూపర్ స్టారేనని, అత్యుత్తమ సినిమా ఇస్తా అని మహేష్ కు మాట ఇచ్చా, అది ఇప్పుడు నిలబెట్టుకున్నా ననుకుంటున్నాను అన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ .. హీరో వెంకటేష్ అంటే తనకు చాలా ఇష్టమనీ, ఎప్పుడు పాజిటివ్ గా ఉంటారని, నవతరం హీరోల్లో విజయ్ దేవరకొండ ఇష్టమన్నారు. తన 25 సినిమాల ప్రయాణం లో కొంతమంది దర్శకులను గుర్తుచేసుకోవాలనుకున్నారు. రాజకుమారుడు మూవీ తో హీరో గా పరిచయం చేసిన రాఘవేంద్రరావు, మురారి సినిమాతో నటించగలనని నిరూపించిన కృష్ణవంశీ , ఒక్కడు మూవీ తో తనను స్టార్ ను చేసిన గుణ శేఖర్, అతడు మూవీ తో కుటుంబ ప్రేక్షకులను దగ్గర చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్, సెన్సేషనల్ హిట్ పోకిరి మూవీ తో సూపర్ స్టార్ స్టేటస్ ఇచ్చిన పూరీ జగన్నాథ్, దూకుడు మూవీ తో తన సినీ కెరీర్ లో గొప్ప మలుపు నిచ్చిన శ్రీను వైట్ల, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలతో తనకు జీవితాన్నిచ్చిన కొరటాల శివ కు రుణపడి ఉంటానన్నారు. సినిమాలతో బిజీగా ఉన్న తనకు కథ చెప్పి 2సంవత్సరాలు వెయిట్ చేసి మహర్షి మూవీ రూపొందించిన వంశీ పైడిపల్లి కి, ఈ మూవీ లో నటించిన అల్లరి నరేష్ కు థ్యాంక్స్ అన్నారు. తనకు నచ్చిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.
[subscribe]
[youtube_video videoid=o_UlEi8Lv10]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: