మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినీ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కల్ట్ సస్పెన్స్ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ సునామీ సృష్టిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ ప్రధాన పాత్రలో, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మే 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే, సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే.. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ‘దృశ్యం 3’ ప్రపంచవ్యాప్త అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఇప్పటికే రూ. 25 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును దాటేసింది.
కేవలం మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే సుమారు రూ. 15.5 కోట్లు రాగా.. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో గ్లోబల్ ప్రీ-సేల్స్ ఈజీగా 30 కోట్ల వైపు దూసుకుపోతోంది.
కేరళలోనే డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 5 కోట్లు దాటగా.. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ‘బుక్మైషో’లో ఇప్పటికే 3.34 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన రెండవ మలయాళ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
ఇక ఈసినిమా తెలుగులోనూ విడుదలకానుండడంతో తెలుగు రీమేక్ చేయడం. మొదటి రెండు భాగాలు బ్లాక్ బస్టర్లు కావడంతో దృశ్యం 3 పై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























