టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన ఆశిష్ వెలమకుచ హీరోగా మరో కొత్త చిత్రం ప్రారంభమైంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ఏడాది ‘బలగం’ వంటి అద్భుతమైన సినిమాను అందించిన హన్షిత రెడ్డి మరియు హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం మూవీ టీమ్ సమక్షంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ ఇవ్వగా ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. యూత్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ మూవీగా ఇది తెరకెక్కుతోందని చిత్ర యూనిట్ తెలిపింది. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అవినాష్ ఇంతకుముందు దసరా, మేజర్, శ్రీమంతుడు, హిట్ మరియు కృష్ణగాడి వీరప్రేమ గాథ వంటి పలు హిట్ సినిమాలకు పనిచేసిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా దిల్ రాజు వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆశిష్.. తన తొలి సినిమా ‘రౌడీ బాయ్స్’తో యూత్ ను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అనంతరం ఆశిష్ రెండో సినిమాగా ‘సెల్ఫిష్’ అనే చిత్రం చేశాడు. ఇందులో బ్లాక్బస్టర్ చిత్రం ‘లవ్ టుడే’తో యువతరాన్ని ఆకర్షించిన ఇవానా కథానాయికగా చేసింది. కాశీ విశాల్ స్వార్థం చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ మరియు ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆశిష్ చేస్తున్న మూడో సినిమా కావడంతో కొత్త చిత్రంపై ఆసక్తి నెలకొంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: