మత్తు వదలరా సినిమాతో హీరోగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు కీరవాణి తనయుడు శ్రీసింహా. ఇక మొదటి సినిమాతోనే మంచి హిట్ ను సొంతం చేసుకోవడమే కాకుండా నటుడిగా మంచి గుర్తింపును సైతం సొంతం చేసుకున్నాడు. అంతేకాదు రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ స్టోరీస్ను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇక అతడు హీరోగా నటిస్తున్న మూడో చిత్రం దొంగలున్నారు జాగ్రత్త. ఈసినిమా సెప్టెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ఇక ట్రైలర్ లో కారును దొంగలించే క్రమంలో డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చుంటాడు హీరో. ఆ తర్వాత డోర్ ఓపెన్ చేస్తే రాదు. ఎంత ప్రయత్నించినా డోర్ ఓపెన్ అవక, కార్లోనే ఇరుక్కుపోతాడు. ఇక కార్లో నుండి హీరో బయటకు రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? బయటకు ఎలా వచ్చాడు? అనే కాన్సెప్ట్తో ఈ చిత్రం ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మరి ఈసినిమా శ్రీసింహాకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
కాగా ప్రీతి ఆస్రాని హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాలో సముద్రఖని కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ‘‘దొంగలున్నారు జాగ్రత్త’’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రోహిత్ కులకర్ణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. యశ్వంత్ సి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. మరి ఈసారి దొంగగా మారిన శ్రీ సింహా ఎంతవరకూ ఆకట్టుకుంటాడో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: