చాలా తక్కవ కాలంలో మంచి పేరును సంపాదించుకుంది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్. తీసిన సినిమాలన్నీ హిట్టవ్వడం.. అవి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం.. వరుస పెట్టి సినిమాలు తీస్తుండటంతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ బ్యానర్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. అయితే మైత్రి మార్క్ ని ఇంకాస్త పెంచాలని ఈ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. మొదటి సినిమానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో తెరకెక్కించాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే సల్మాన్ కు సన్నిహితుడు, నిర్మాత అయిన అతుల్ అగ్నిహోత్రి తో చర్చలు జరిపారట. ఇక ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించినట్టు సమాచారం. మరి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందేమో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’, అల్లు అర్జున్ 20వ సినిమాలను నిర్మిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా కూడా ఇదే బ్యానర్ లో రూపొందనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: