చిరంజీవి మొదటి డైరెక్టర్ కన్నుమూత

మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ మూవీ పునాదిరాళ్లు మూవీ డైరెక్టర్ గుడిపాటి రాజ్ కుమార్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. గతకొద్ది కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన చికిత్స పొందుతూనే మరణించారు. ఇటీవలే రాజ్ కుమార్ భార్య, పెద్ద కొడుకు మరణించడంతో మనస్థాపానికి గురై అనారోగ్యం పాలయ్యారు. ఈ విషయం తెలిసి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఆయనకు అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అయినా కూడా మానసికంగా కృంగిపోవడంతో అనారోగ్యానికి గురై నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మృతి గురించి తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా ఉయ్యూరు. ఆయన భౌతికకాయాన్ని ఉయ్యూరు తీసుకు వెళ్ళేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇక రాజ్ కుమార్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చిరంజీవి. ఆయన మృతి తీరని లోటన్నారు. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తన నట జీవితానికి “పునాది రాళ్లు” వేసింది ఆయనే అన్నారు. ఈ మధ్యనే తన ఇంటికి వచ్చి కలిశారని.. అనారోగ్యంతో ఉన్నానని చెప్పడంతో అపోలో ఆస్పత్రికి పంపించి వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగిందన్నారు.ఆయన పూర్తి ఆరోగ్యంతో మళ్లీ నా దగ్గరకు వస్తారు అనుకున్నాను ఇంతలో ఇలా జరగటం చాలా బాధాకరమన్నారు.

కాగా చిరంజీవికి పునాది రాళ్లు మొదటి సినిమా కాగా.. రాజ్ కుమార్ కు కూడా ఆ సినిమా మొదటిదే. అంతేకాదు మొదటి సినిమాకే ఐదు నంది అవార్డులు దక్కించుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =