స్టార్ హీరోలకు ప్లస్ అవుతున్న సీనియర్ హీరోయిన్స్

Senior Heroine Re Entries Turing As Lucky Charm for Star Heroes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Tollywood Senior Heroines Latest News,Telugu Film Industry Senior Heroines Re Entries

ఒకప్పుడు స్టార్ హీరోల పక్కన స్టార్ హీరోయిన్లు గా వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లు ఇప్పుడు.. ఈ జనరేషన్ లో స్టార్ హీరోల పక్కన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఏదో పాత్ర దక్కింది చేస్తున్నాం అన్నట్టు కాకుండా.. దర్శకులు కూడా ఏదో వారిని తీసుకోవాలి.. పాత్ర ఇవ్వాలి అన్నట్టు కాకుండా.. సినిమాకే వాళ్ళు కీలక పాత్రలుగా చేస్తున్నారు. వాళ్ళ ద్వారానే సినిమా నడిచే పాత్రలను సృష్టిస్తున్నారు. అలా ఆనాడే కాదు.. ఈ జనరేషన్ స్టార్ హీరోలకి… వారి సినిమాలకి క్రేజ్ తీసుకొస్తూ… ప్లస్ అవుతున్నారు.. ఆనాటి స్టార్ అండ్ సీనియర్ హీరోయిన్స్.. మరి వారి ద్వారా క్రేజ్ వచ్చిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దామా..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నదియా – అత్తారింటికి దారేది

ఇందులో ఫస్ట్ సినిమాగా అత్తారింటికి దారేది సినిమా గురించి చెప్పొచ్చు. త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా లో పవన్ తర్వాత అంతటి కీ రోల్ సీనియర్ హీరోయిన్ నదియాదే. తమిళంలో టాప్ హీరోయిన్‌గా పేరుగాంచిన నదియా.. తను చేసిన మొదటి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డును దక్కించుకుంది. మలయాళ, తమిళ భాషల్లో ఎన్నో హిట్ సినిమాలను తీసిన ఆమె అత్తారింటికి దారేది సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. టైటిల్ లోనే త్రివిక్రమ్ ఈ సినిమా థీమ్ ఏంటో చెప్పేసాడు. ఆమె పాత్రను త్రివిక్రమ్ తీర్చి దిద్దిన విధానం కూడా అలానే ఉంటుంది. నదియా హుందాతనం ప్రేక్షకులను కూడా కట్టిపడేసింది. ఇక కుష్బూ ను కూడా త్రివిక్రమే రీ ఎంట్రీ చేయించాడు. అజ్ఞాతవాసి సినిమా లో కుష్బూ కు కీలక పాత్ర ఇచ్చాడు.

రమ్యకృష్ణ – బాహుబలి

ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోయింది రమ్యకృష్ణ. ఇక ఆ తర్వాత 2002 వ సంవత్సరంలో దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపొయింది. ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరమైన రమ్య కృష్ణ రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలోని శివగామి పాత్ర దక్కింది. ఇక శివగామి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. ఆ తర్వాత పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే. శివగామిగా రమ్యకృష్ణ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఆ పాత్రలో ఆమెను తప్ప మరెవరిని ఊహించలేని విధంగా అద్భుతంగా నటించారు. ‘బాహుబలి’ సినిమాతో ఆమెకు డిమాండ్ పెరిగింది. దర్శకులు ఆమె కోసం ప్రత్యేకమైన పాత్రలను రూపొందిస్తున్నారు.

విజయ శాంతి – సరిలేరు నీకెవ్వరు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇక ఈ సినిమాలో విజయ శాంతి కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంది. తెలుగు ప్రేక్షకులతో లేడీ సూపర్ స్టార్‌గా పిలుపించుకున్న విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన తరవాత సినిమాలకు దూరమైపోయారు. 2006లో వచ్చిన ‘నాయుడమ్మ’ సినిమాలో ఆమె చివరి సారిగా కనిపించారు. ఆ తరవాత మరే సినిమాను ఆమె అంగీకరించలేదు. ఇపుడు మహేష్ బాబు హీరో నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేష్ బాబుతో సరితూగే పాత్రను చేసింది. ఇన్నేళ్ల తర్వాత రాములమ్మ తిరిగి కెమెరా ముందుకొస్తోందంటే.. ఖచ్చితంగా తనదైన శైలిలో పాత్ర పరిధి ఉంటుందని ఫిక్సయ్యారు ప్రేక్షకులు ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు విజయ శాంతి కోసం క్యూ కడతారేమో.

మధుబాల – నాన్నకు ప్రేమతో

నటి మధుబాల అంటే.. ఠక్కున గుర్తొచ్చేది అరవింద స్వామి హీరోగా దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’ చిత్రం. ఈ సినిమాలో ఆమె నటనకు గానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కింది. క్రిటిక్స్ సైతం ఆమె అద్భుత నటనకు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘అల్లరి ప్రియుడు’, ‘జెంటిల్‌మెన్’ వంటి పలు కమర్షియల్ సినిమాలు తీసి విజయాలు అందుకున్న మధుబాల.. 2001లో సినిమాలకు దూరమయ్యింది. అయితే మళ్ళీ 2008లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె తెలుగులో ‘అంతకముందు.. ఆ తర్వాత’, ‘సూర్య వెర్సస్ సూర్య’, ‘నాన్నకు ప్రేమతో’ లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి మెప్పించింది.

టబు – అల వైకుంఠపురములో

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు అల వైకుంఠపురములో సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున, వెంకటేష్, చిరు, బాలయ్య లతో హీరోయిన్ గా నటించిన టబు ఆ తర్వాత తెలుగు పరిశ్రమకు దాదాపు దూరమయ్యారు. బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఓ ముఖ్యపాత్రలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక అత్తారింటికి దారేది సినిమాలో నదియా పాత్రను ఏ రేంజ్ లో ఎలివేట్ చేశారో…. ఇక ఇప్పుడు అంతకంటే హై లెవెల్లో డైరెక్టర్ త్రివిక్రమ్ టబు క్యారెక్టర్ నీ ఈ సినిమాలో డిజైన్ చేసినట్లు వార్తలు వినబడుతున్నాయి. మరి టబు క్యారెక్టర్ వల్ల సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

స్నేహ – వినయ విధేయ రామ

తొలివలపు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన నటి స్నేహ. తన అందం, అభినయంతో ఎలాంటి స్కిన్ షో చేయకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పాండురంగ సినిమా తరువాత వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. ఆ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని బోయపాటి రామ్ చరణ్ కాంబోలో వచ్చిన వినయ విధేయ రామ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. చరణ్ కి వదినగా నటించి అభిమానులను మెప్పించింది.

భూమిక – ఎంసీఏ

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి అప్పట్లో క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది భూమిక. ఆ తరువాత మిస్సమ్మ, జై చిరంజీవ లాంటి చిత్రాలతోనూ తన సత్తా చాటింది. అయితే ఆ తరువాత బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించినప్పటికీ ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేకపోయింది. ఇక కొంత గ్యాప్ తర్వాత ఎంసీఏ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన భూమిక సెకండ్ ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టారు. మూవీలో నానికి వదినగా.. నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగిగా నటించి క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత సవ్యసాచి సినిమాలో అక్కినేని నాగచైతన్యకు అక్కగా కూడా నటించింది.

ఇంకా వీరితో పాటు చాలామంది హీరోయిన్లు తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎన్నో అపురూపమైన పాత్రల్లో నటించి మెప్పింస్తున్నారు. మీనా, జ్యోతిక,రాశి, మీనా లాంటి వారు తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + ten =