రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ సింగ్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ వైకుంఠ బోను దర్సకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘నిన్నే పెళ్లాడుతా’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతకొద్ది కాలంగా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. మంచి కమర్షియల్ హంగులున్న యాక్షన్ చిత్రమిది. హీరోహీరోయిన్లులతో పాటు సాయికుమార్, సీత, ఇంద్రజల నటన ఈ చిత్రంలో హైలెట్ గా వుంటుంది. మంచి ఎమోషన్స్ తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది మా చిత్రం. రెండు పాటలు, రెండు ఫైట్స్ మినహా టాకీ మొత్తం పూర్తయ్యింది. డిసెంబరు ఎండింగ్ లో సినిమా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
కాగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను అంబికా ఆర్ట్స్, ఈశ్వరి ఆర్ట్స్ పతాకాలపై బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అన్నపూర్ణ,యోగి,కబీర్ సింగ్,విజ్జులేఖ,రామన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం నవనీత్, సినిమాటోగ్రఫీ ప్రసాద్ వీవీఎస్ఎన్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: