కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నరేంద్ర అనే డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. మహేష్ కొనేరు నిర్మిస్తున్నాడు. మహిళలపై జరిగే అకృత్యాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. గతకొద్ధి కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాకి గతంలో సఖి అనే పేరు వినిపించగా ఇప్పుడు మరో పేరు తెర పైకి వచ్చింది. ‘మిస్ ఇండియా’ అనే టైటిల్ ని ఈ సినిమా కోసం చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే. కాగా రాజేంద్రప్రసాద్, నదియా, నరేష్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
దీనితో పాటు కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు బాలీవుడ్ లో కూడా కీర్తీ సురేష్ ఓ సినిమా చేస్తుంది. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్బాల్ జట్టుకు కోచ్గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథను తెరకెక్కించనున్నారు. ఈసినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ సరసన నటించే ఛాన్స్ను కొట్టేసింది కీర్తి సురేష్.
[subscribe]
[youtube_video videoid=G9nrHltl0ng]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: