సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ మూవీ సాహో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చి సోషల్ మీడియాలో కొత్త రికార్డులు సైతం క్రియేట్ చేసింది. ప్రభాస్ పై, సుజిత్ పై సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. ఈసినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగష్ట్ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో రిలీజ్ వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం..ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటింగ్ రైట్స్ ను ఫర్స్ ఫిల్మ్స్ సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఒక్క మిడిల్ ఈస్ట్ లో మినహా, యశ్ రాజ్ ఫిలిమ్స్ వారితో కలిసి ఫర్స్ ఫిల్మ్స్ వారు విదేశాల్లో మన సినిమాలను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ సంస్థ ‘సాహో’ విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు సొంతం చేసుకుంది. దీంతో ‘సాహో’ మరింత భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వెళ్లనుందనే విషయం స్పష్టమవుతోంది.
కాగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
[youtube_video videoid=rDoFiOjoC2Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: