రాజ్ దూత్ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు రియల్ హీరో శ్రీహరి తనయుడు మేఘాంశ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే రెండు రోజుల క్రితం రిలీజైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక కూడా ఈ ఏడాదే తెలుగు ఇండస్ట్రీలోకి కాలు పెట్టబోతుంది. సెన్సేషనల్ స్టార్ విజయదేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండ సరసన దొరసాని అనే సినిమాలో శివాత్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇటీవలే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదిలా ఉండగా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రారంభమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మేఘాంశ్, శివాత్మిక కలిసి కొత్త సినిమా తెరకెక్కనుందట. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమాను కొత్త దర్శకుడు తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దొరసాని సినిమాను, రాజశేఖర్ పెద్ద కూతురు శివాని సినిమాను నిర్మిస్తున్న సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ త్వరలోనే వెలువడనున్నట్టు సమాచారం.
మొత్తానికి ఒక సినిమా పూర్తి కాకముందే ఇద్దరికి రెండో సినిమా ఆఫర్ వచ్చిందంటే గ్రేటే. మరి ఇద్దరికీ మొదటి సినిమా ఎలాంటి ఫలితాలు అందిస్తుందో చూద్దాం..
[youtube_video videoid=Dp644lyVaDo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: