‘వినాయకుడు’.. ‘కేరింత’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సాయికిరణ్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాన్పెప్ట్ తో ఆది హీరోగా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో సాషా ఛెత్రి హీరోయిన్ గా నటిస్తుండగా.. కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, అబ్బూరి రవి, అనీశ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వినాయకుడు టాకీస్ బ్యానర్పై ప్రతిభ అడివి, కట్ట ఆశీష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీశ్ డేగల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా.. జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆదికి ఈ సినిమాఎంత వరకూ సక్సెస్ ఇస్తుందో చూద్దాం.
[youtube_video videoid=Di2RS42rXuU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: