బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన సాయి పల్లవి కథలను బట్టి మూవీస్ ఎంపిక చేసుకుంటున్నారు. హీరోయిన్ సాయి పల్లవి విరాటపర్వం 1992 మూవీ లో డీ గ్లామరైజ్డ్ రోల్ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ మూవీ నీదీ నాదీ ఒకే కథ దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన తారాగణంగా నిజ జీవిత సంఘటనల తో విరాట పర్వం 1992 మూవీ రూపొందనుంది. టబు, ప్రియమణి, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విరాట పర్వం 1992 మూవీ లో హీరోయిన్ సాయి పల్లవి మేకప్ లేకుండా నటించడం విశేషం. లవ్ ఫెయిల్యూర్ తో డిప్రెషన్ లో నక్సలైట్ గా మారే పేదింటి అమ్మాయి గా సాయి పల్లవి , ఆ విలేజ్ లోనే పొలిటికల్ లీడర్ గా రానా నటిస్తున్నారు. గుండెలు పిండే సన్నివేశాలతో, ఆ క్యారెక్టర్స్ లో ప్రజలు మమేకం అయ్యేలా కథ ఉంటుందని సమాచారం. మానవ హక్కులకు సంబంధించిన కథ గా ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమాలోనూ టచ్ చేయని పాయింట్ తో రూపొందుతుంది. సుధాకర్ చెరుకూరి, సురేష్ బాబు నిర్మాణ సారథ్యం లో రూపొందనున్న విరాట పర్వం 1992 మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ జూన్ నెలలో ప్రారంభమవుతుంది. వరంగల్, కరీం నగర్, సిద్ధిపేట తదితర ప్రాంతాలలో షూటింగ్ జరుగనుంది.
[subscribe]
[youtube_video videoid=5BepH_ipBm0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: