తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్.జి.కె (నంద గోపాలన్ కుమారన్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా టీజర్ ఇటీవలే రిలీజవ్వగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ సినిమాలో సూర్య చాలా వేరియన్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత కొద్దికాలంగా ఈ సినిమా రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంటూనే ఉంది. నిజానికి గత ఏడాది దీపావళికే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను రిలీజ్ చేయలేకపోయారు. ఆ తరువాత ఏప్రిల్ మధ్యలో రిలీజ్ చేయాలనుకున్నారు అది కూడా కుదర్లేదు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మే 31వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. తమిళ్, తెలుగు రెండు భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
కాగా ఈ సినిమాలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. వారియర్ డ్రీమ్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మాతలు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు.
[youtube_video videoid=OJnztxKkNFk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: