ప్రస్తుతం `రణరంగం`, `96` రీమేక్తో బిజీగా ఉన్న యువ కథానాయకుడు శర్వానంద్… తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించాడు. `శ్రీకారం` పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా కిశోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం… ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. కాగా… ఆగస్టు తొలి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ని 2020 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే… సంక్రాంతి సీజన్లో ఇప్పటివరకు శర్వానంద్ (కథానాయకుడిగా) రెండు చిత్రాలతో పలకరించగా… రెండు సార్లూ భారీ విజయాలే దక్కాయి. `ఎక్స్ప్రెస్ రాజా`(2016), `శతమానంభవతి`(2017) రూపంలో ఆ విజయాలు దక్కాయి. మరి… ముచ్చటగా మూడోసారి సంక్రాంతికి రాబోతున్న సినిమాతోనూ శర్వా గ్రాండ్ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. అన్నట్టు… 2006లో రిలీజైన సంక్రాంతి సీజన్ ఫిల్మ్ `లక్ష్మీ`లోనూ విక్టరీ వెంకటేష్కి తమ్ముడిగా కనిపించి విజయం అందుకున్నాడు శర్వా. మొత్తానికి… ఏ రకంగా చూసినా శర్వాకి సంక్రాంతి లక్కీయస్ట్ సీజనే. సో… `శ్రీకారం`తోనూ ఆ విజయపరంపరని శర్వా కొనసాగించాలని ఆశిద్దాం.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.