2010లో ‘లీడర్’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు రానా. ఇక అప్పటినుండి డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మొదటి సినిమా లీడర్ నుండి ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత ఉంటుంది. అందుకే రానా సినిమా అంటే అందరికీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇటీవలే విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా ఎన్నో సార్లు వాయిదా పడుతూ ఫైనల్ గా ఇటీవలే రిలీజ్ అయింది. ఇక కలెక్షన్స్ పరంగా సినిమా నిరాశ పరిచినా పెర్ఫామెన్స్ పరంగా మాత్రం విమర్శకుల ప్రశంసలు కురిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ప్రస్తుతం రానా కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇటీవల నాగచైనత్య తన సినిమా ప్రచారంలో భాగంగా మానాడు రీమేక్ లో రానా నటిస్తున్నాడన్న విషయం చెప్పాడు. కానీ దీనిపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరోవైపు రానా ఫ్యాన్స్ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు రానా తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా తన ఫ్యాన్స్ కు షాకిచ్చాడు. ఇంతకీ తను ఇచ్చిన షాక్ ఏంటంటే.. ప్రస్తుతం వర్క్ ప్రాసెస్ లో ఉంది. సోషల్ మీడియా నుండి చిన్న బ్రేక్ తీసుకోనున్నాను. థియేటర్లలో కలుద్దాం. ప్రేమతో రానా’ అంటూ సోషల్ మీడియాకు తాత్కాలికంగా దూరమవుతున్నట్టు ప్రకటించాడు. మరి సడెన్ గా రానా తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలోనే ఉన్నారు. చూద్దాం మరి రానా మళ్లీ ఎప్పుడు యాక్టివ్ అవుతారో..
— Rana Daggubati (@RanaDaggubati) August 5, 2022
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: