వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా-సాయిపల్లవి జంటగా తెరకెక్కిన సినిమా విరాటపర్వం. ఇద్దరు టాలెంటెడ్ నటుల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా పై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. అయితే ఈసినిమా రిలీజ్ అవ్వడానికి కాస్త లేట్ అయింది.. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తూ ఫైనల్ గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక చివరి రోజుల్లో మాత్రం చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్ బాగానే చేసి సినిమాపై బాాగానే బజ్ ను క్రియేట్ చేసింది. మరి ఈసినిమా ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అయింది.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. రానా, సాయి పల్లవి, నవీన్ చంద్ర, ప్రియమణి, నందితా దాస్, జరీనా వాహాబ్, ఈశ్వరి రావు, సాయి చంద్, నివేద పేతురాజ్, తదితరులు
దర్శకత్వం.. వేణు ఉడుగుల
బ్యానర్స్.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్
నిర్మాతలు.. సురేష్, సుధాకర్ చెరుకూరి
సంగీతం.. సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫి.. డాని సంచెజ్ లోపెజ్, దివాకర్ మణి
కథ..
విరాటపర్వం కథ 1990వ ప్రాంతంలో జరిగిన కథ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా 1973 లో వెన్నెల (సాయి పల్లవి) అనే అమ్మాయి పుట్టుకతో మొదలవుతుంది. సరదాగా ఉల్లాసంగా గడిపే వెన్నెల కామ్రేడ్ అరణ్య అలియాస్ రవన్న (రానా) రాసే పద్యాలు చదివి ప్రేరణ పొందుతుంది. అతను ఎవరో తెలియకుండానే అతనితో ప్రేమలో పడుతుంది. తనతోనే కలిసి నడవాలని నిర్ణయించుకుని అతనిని కలవడానికి వెళ్తుంది. మరోవైపు రవన్నను పట్టుకునేందుకు పోలీసులు కూడా తీవ్రంగా గాలిస్తుంటారు. అలాంటి సమయంలోనే వెన్నెల కూడా ఇళ్లు వదిలి రవన్న కోసం ఊరురా తిరుగుతుంది. చివరికి వెన్నెల రవన్న ని కలిసిందా? రవన్న వెన్నెల ను ప్రేమిస్తాడా? రవన్న వల్ల వెన్నెల జీవితం ఎలా మారింది? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ..
ఈసినిమా నక్సలైట్ల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అని ఇప్పటికే అర్థమయిపోయింది. అయితే ఇలాంటి సినిమాలు తీయడం కూడా కత్తిమీద సాము లాంటిందే. ఏ చిన్న తేడా జరిగినా కూడా చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఆ విషయంలో వేణు ఉడుగుల చాలా జాగ్రత్తగానే ఈసినిమాను డీల్ చేసినట్టు తెలుస్తుంది. తను తెరకెక్కించిన నీది నాది ఒకే కథ సినిమాతోనే తన టాలెంట్ ను చూపించాడు. తన సినిమాల్లో ఒక రియల్ ఫీల్ ఉంటుంద్న విషయం ఇప్పటికే తెలియచేశాడు. ఇక ఈసినిమాను కూడా 1990 లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాడు వేణు. ఈసినిమా మొత్తం వెన్నెలదే అని ఇప్పటికే చిత్రయూనిట్ పలు సందర్భాల్లో తెలిపింది. ఇక వెన్నెల పాత్ర నిజ జీవితంలోని తూము సరళ పాత్ర ద్వారా రూపొందించాడన్న విషయం కూడా తెలిసిందే. సరళ జీవితంలో జరిగిన ఒక విషాద ఘటనను సినిమాలో చూపించాడు వేణు. నిజానికి సరళను నక్సలైట్లే చంపేశారు. అయితే అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి.. దళంలో చేరిన సరళను నక్సలైట్లే ఎందుకు చంపారు అన్న విషయం చాలా స్మూత్ గా హ్యాండిల్ చేశాడు. ఓ రియల్ ఇన్సిడెంట్ కు ప్రేమ కథను అల్లి ఎమోషనల్ డ్రామాను పండించడంలో సక్సెస్ అయ్యాడు. తప్పు ఎవరిది? ఒప్పు ఎవరిది.. ఈ పాపం ఎవరిది అంటూ చివర్లో వేసిన పాట ద్వారా ప్రేక్షకులకే తుది నిర్ణయం వదిలేసినట్టు అనిపిస్తుంది.
మొదటి నుండి మేకర్స్ చెబుతున్నట్టే ఈసినిమాకు ప్రధాన బలం సాయి పల్లవి. ఇక సాయి పల్లవిని తీసుకొనే వేణు సగం సక్సెస్ కొట్టేశాడు. ఇక సినిమా కథ మొత్తం ,సాయి పల్లవి చుట్టూనే తిరుగుతుంది. మరోసారి తన అద్భుతమైన నటనతో సాయిపల్లవి ప్రేక్షకులను కట్టి పడేసింది. రవన్న కారెక్టర్లో దళనాయకుడిగా రానా ఆకట్టుకుంటాడు. రానా నటన, తన డైలాగ్ డెలివరీ పాత్రను మరింతగా ఎలివేట్ చేసింది. మిగతా పాత్రధారులైన ఈశ్వరీరావు, సాయి చంద్, రాహుల్ రామకృష్ణ, బెనర్జీ, నివేదా పేతురాజ్ ఇలా అందరూ తమ తమ పాత్రల పరిది మేర నటించారు. నిజానికి వీరిలో చాలా మంది పాత్రల నిడివి చాలా తక్కువే అయినా కూడా కథను నమ్మి చేయడం గొప్ప విషయం.
ఈసినిమాకు ప్రధాన బలాల్లో సినిమాటోగ్రఫి, సంగీతం కూడా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. డానీ మరియు దివాకర్ మణి అందించిన విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం కూడా బాగుంది. పాటలు, మద్యలో వచ్చే జానపద గేయాలు, నేపథ్య సంగీతం అన్నీసినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
మొత్తానికి విరాట పర్వంతో ఒక అందమైన ప్రేమ కథను చూపించాడు వేణు. ప్రేమ కథలు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని ప్రేమకథలు మాత్రమే హృదయం బరువెక్కేలా చేస్తాయి. అలాంటి సినిమానే ఈ విరాట పర్వం. ప్రతి ఒక్కరూ చూసే సినిమా ఇది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: