శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మేజర్. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను తెరకెక్కించారు. ఇక ఈసినిమాతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు అడివి శేష్. మరోవైపు ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘మేజర్’ను మునుపెన్నడూ లేని విధంగా ప్రమోట్ చేస్తున్నాడు అడివి శేష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా మొత్తం నిడివి 149 నిమిషాలు. మేజర్ చిత్రం కంటెంట్, భావోద్వేగాలు సెన్సార్ బోర్డ్ సభ్యులని ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ కు ముందే దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో మేజర్ సినిమా ప్రివ్యూలు వేయనున్న సంగతి తెలిసిందే. తొమ్మిది నగరాల్లో ఈసినిమా ప్రివ్యూలు వేయనున్నారు. శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: