దాదాపు పాతికేళ్ల క్రితం ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘తాళి’ సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాను కూడా రీమేక్ చేయాలనీ చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ ఈ సినిమాను రీమేక్ చేసే హీరో ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు.. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన దొరసాని సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ నటినటులుగా ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. వెంటనే రెండో సినిమాను కూడా మొదలుపెట్టాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో సినిమాను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.
‘తాళి’ రీమేక్లో ఆనంద్ నటించనున్నట్లు తెలుస్తోంది. నేటి అభిరుచులకు అనుగుణంగా ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారట. అయితే దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఈ కాలం నాటి ప్రేక్షకులను ఈ సినిమా కథ ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: