ఇప్పుడంతా పాన్ – ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ప్రతీ స్టార్ హీరో కూడా అలాంటి చిత్రాలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త్వరలో ఓ పాన్ ఇండియా ఫిల్మ్ కి ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయిన ప్రశాంత్ నీల్… మహేష్తో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీన్ని కూడా పాన్ ఇండియా ఫిల్మ్లా ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్. 2020 మే ప్రథమార్థంలో పట్టాలెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ కొత్త లుక్లో దర్శనమివ్వనున్నారట. అంతేకాదు… తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం. మరి… మహేష్, ప్రశాంత్ కలయికలో రానున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
కాగా… మహేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’… 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రశాంత్ రూపొందిస్తున్న `కేజీఎఫ్ ఛాప్టర్ 2` 2020 ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: