తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ‘అసురన్’ మూవీ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత నెల 4వ తేదీన విడుదలైన ఈ సినిమా, ధనుశ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నా సంగతి కూడా తెలిసిందే. ఈ రీమేక్ లో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. గతంలో వెంకటేష్ తో కలిసి ‘గోపాల గోపాల’ సినిమాలో నటించిన శ్రేయ శరణ్ ఈ సినిమాలో నాయికా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రేయ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.
కాగా అసురన్ తెలుగు వర్షన్ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాను తాజాగా ‘రాజుగారి గది 3’ సినిమాకి దర్శకత్వం వహించి హిట్ కొట్టిన ఓంకార్ కి ‘అసురన్’ తెలుగు రీమేక్ సినిమాని డైరెక్ట్ చేసే బాధ్యత అప్పగిస్తున్నట్టు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: