ఇద్దరు కథానాయకులు కలసి వెండితెరపై కనిపిస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇక ఆ హీరోలిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్ళైతే డబుల్ బొనాంజా దక్కినట్టే. ఇప్పుడు ‘వెంకీమామ’తో అదే జరుగుతోంది. నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో… పాయల్ రాజ్పుత్, రాశి ఖన్నా నాయికలుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్కు కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో నాయకానాయికలపై తెరకెక్కించిన పాటతో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను… తొలుత దీపావళి కానుకగా విడుదల చేయనున్నారని వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం… 2020 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: