బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 15 నుండి ప్రారంభమవుతుండగా… 2020 మేలో తెరపైకి తీసుకురానున్నారు. ఇదిలా ఉండగా గతకొద్ది రోజులుగా ఎంజీఆర్, కరుణానిధి పాత్రలపై పలు ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ఎంజీఆర్ పాత్రను అరవిందస్వామి చేయనుండగా కరుణానిధి పాత్రను ప్రకాశ్ రాజ్ చేయనున్నట్టు కూడా టాక్స్ వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒకవేళ ప్రకాష్ రాజ్ కనుక ఈ సినిమాలో నటిస్తే.. మళ్లీ 22 ఏళ్ల తర్వాత అదే పాత్రలో నటిస్తున్నట్టు లెక్క. గతంలో కూడా ప్రకాశ్ రాజ్ కరుణానిధి పాత్రలో నటించారు. 1997లో మణిరత్నం రూపొందించిన ‘ఇరువర్’ (ఇద్దరు) చిత్రంలో కరుణానిధి పాత్రను పోషించారు. అప్పట్లో ఆ పాత్రకు, అందులో ప్రకాశ్ రాజ్ నటనకు ఎన్నో ప్రసంశలు అందాయి. మళ్లీ 22 ఏళ్ల తర్వాత అదే పాత్రలో నటిస్తున్నారాయన.
కాగా ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో జగపతి బాబు, జయసుధ, సత్యరాజ్ ముఖ్య పాత్రలలో నటించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఏం పత్రాలు పోషిస్తున్నారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. విబ్రి మీడియా బ్యానర్ పై విష్ణు ఇందూరి నిర్మాణ సారథ్యం లో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: