‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ఫుల్ లేడీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు నందినీ రెడ్డి. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారామె. ఇది కూడా ఓ వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతుందని సమాచారం. స్వప్న సినిమాస్ పతాకంపై ప్రియాంక దత్, స్వప్న దత్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్కి మిక్కీ జే మేయర్ బాణీలు అందించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో… నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించనున్నాడని తెలుస్తోంది. నాని హీరోగా నటించిన ‘అలా.. మొదలైంది’(2011)తోనే నందినీ రెడ్డి దర్శకురాలిగా తొలి అడుగులు వేసారు. మళ్ళీ 8 ఏళ్ళ గ్యాప్ తరువాత నాని, నందినీ రెడ్డి కాంబినేషన్లో సినిమా అంటే… ఆసక్తికరమైన అంశమనే చెప్పాలి. త్వరలోనే నాని ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: