‘మహానటి’ సినిమా తర్వాత కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క హిందీలో కూడా సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ లో కూడా కీర్తీ సురేష్ ‘మైదాన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్బాల్ జట్టుకు కోచ్గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథను తెరకెక్కించనున్నారు. ఈసినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. గతకొద్ది కాలంగా ముంబాయి లో జరుపుకుంటున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలో రెండో షెడ్యూల్ ను మొదలపెట్టనుంది.
కాగా ప్రస్తుతం కీర్తి నరేంద్ర నాథ్ అనే కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుది. ఇటీవలే ఈ సినిమాకు ‘మిస్ ఇండియా’ అనే ను టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. దీనితో పాటు నగేష్ కుక్కునూరు దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో నటిస్తుంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. దీనితో పాటు మలయాళంలో ‘మరక్కార్: ది అరభికడలింటే సింహమ్’ అనే సినిమాలో కూడా నటిస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: