‘కింగ్’ నాగార్జునకి కలిసొచ్చిన దర్శకుల్లో ఎ.కోదండరామిరెడ్డి ఒకరు. ఈ ఇద్దరి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘అల్లరి అల్లుడు’ ఒకటి. నాగార్జున సరసన నగ్మా, మీనా కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో అలనాటి మేటి నటి వాణిశ్రీ కీలక పాత్ర పోషించారు. రావుగోపాలరావు, కోట శ్రీనివాసరావు, మురళీమోహన్, చలపతిరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, సంగీత తదితరులు ఇతర పాత్రల్లో నటించగా… రమ్యకృష్ణ ఓ స్పెషల్ సాంగ్లో నర్తించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్వరవాణి కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా హిందీ చిత్రం ‘ఆరాధన’లోని “మేరే సప్నోంకి రాణి” పాట స్పూర్తితో స్వరపరచిన “నిన్ను రోడ్డు మీద చూసినది” గీతం అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించింది. అలాగే… “ఒక్కసారే వన్స్ మోరే”, “రైక చూస్తే రాజమండ్రి”, “మచిలీపట్నం మాయాబజార్”, “ఛలో నా చక్కెర కేళి”, “కమ్మని వొడి బొమ్మని”, “తొడతొక్కిడి తోటలోన”… ఇలా ప్రతీ పాట మాస్ ని మురిపించింది. నాగార్జునకు అచ్చొచ్చిన నిర్మాతల్లో ఒకరైన డి.శివప్రసాద్ రెడ్డి (కామాక్షి ఆర్ట్ మూవీస్ అధినేత) నిర్మించిన ఈ చిత్రాన్ని… కన్నడంలో ‘గడిబిడి అలియా’ పేరుతో పునర్నిర్మించారు. 1993 అక్టోబర్ 6న విడుదలై సూపర్ హిట్గా నిలచిన ‘అల్లరి అల్లుడు’కు… నేటితో 26 ఏళ్ళు పూర్తవుతున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: