దర్శకుడు సంపత్ నందికి కలిసొచ్చిన కథానాయిక తమన్నా. ఇది వరకు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ మంచి విజయం సాధించాయి. మళ్ళీ నాలుగేళ్ల గ్యాప్ తరువాత ఈ ఇద్దరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా రానుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘గౌతమ్ నంద’ తరువాత యాక్షన్ హీరో గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో మరో యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సినిమాలోని కథానాయిక పాత్ర కోసం మిల్కీ బ్యూటీ తమన్నాని ఎంపిక చేసిందట చిత్ర బృందం. తాజా సమాచారం ప్రకారం… ఇటీవల తమన్నాని సంప్రదించిన దర్శకుడు సంపత్
ఆమెకు కథను నెరేట్ చేసాడని… కథ, తన పాత్ర తీరుతెన్నులు నచ్చడంతో తమన్నా కూడా ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించిందని తెలిసింది. త్వరలోనే తమన్నా ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాగా… గోపీచంద్, తమన్నా కాంబినేషన్ లో రానున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: